వాషింగ్టన్ : ఒకవైపు మనం కరోనా వైరస్ నిరోధానికి టీకాలు దొరక్క ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు టీకాలు తీసుకోవడానికి రండహో.. అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నారు అమెరికా అధికారులు. ఒహియో స్టేట్ గవర్నర్ ఒకడుగు ముందుకేసి.. టీకా టీసుకోండి.. మిలియన్ డాలర్ల లాటరీలో జాక్పాట్ కొట్టేయండి.. అంటూ వినూత్న ప్రచారం చేపట్టారు. ముఖ్యంగా యువతకు టీకా గాలం వేసేందుకు వారికి స్కాలర్షిప్ కూడా ఇస్తామంటూ చెప్తున్నారు.
అమెరికాలోని ఒహియో స్టేట్లో కరేనా వ్యాక్సిన్ను విజయవంతంగా నిర్వహించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డెవిన్ ఒక వినూత్నమైన ప్రణాళికను ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు మిలియన్ డాలర్ల లాటరీలో అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.7.35 కోట్లు గెలుపొందే అవకాశాన్ని పొందండి అంటూ ప్రచారం ప్రారంభించారు. ఐదుగురు వేర్వేరు విజేతలకు ఈ మొత్తాన్ని అందజేస్తామని ప్రకటించారు.
ఇక యువతకు గాలం వేసి వారికి కరోనా టీకా ఇప్పించేందుకు విశేషంగా కృషిచేస్తున్నారు. 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి కళాశాల స్కాలర్షిప్ ఇస్తామంటూ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. యువకులకు కళాశాల, విశ్వవిద్యాలయంలో నాలుగేండ్లపాటు ట్యూషన్ ఫీజు, వసతి పొందుతారని అధికారులు చెప్తున్నారు. ఈ రెండు ప్రణాళికలతో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తారని, వారి భయాలు కూడా తొలగిపోతాయని గవర్నర్ మైక్ డెవిన్ అభిప్రాయపడుతున్నారు.
స్వతంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్తో చేతులు కలిపిన పీఎస్యూలు
విపత్తులో దోపిడీ అవకాశాన్ని వెతుక్కుంటున్న చైనా
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
సంపాదనలో స్టార్ ఆటగాళ్లను వెనక్కినెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..