గాజా : ఇజ్రాయెల్ మిలిటరీ గాజాలోని హమాస్ అగ్ర నాయకుడి ఇంటిని వైమానిక దాడిలో పేల్చింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హిడాయ్ జిల్బెర్మాన్ ఈ సమాచారాన్ని రేడియోలో ఇచ్చారు. ఆయన వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ అగ్ర నాయకుల్లో ఒకరైన యెహియా సిన్వర్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగాయి. దాడి సమయంలో అతను అక్కడ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ దాడి జరిగిన ఇల్లు దక్షిణ గాజా ప్రాంతంలో ఖాన్ యూనస్ పట్టణంలో ఉన్నది.
ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, సిన్వర్ సోదరుడి ఇంటిపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది పాలస్తీనా యోధులు మరణించారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య బాంబు దాడులు సోమవారం ప్రారంభమయ్యాయి. హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులు ఇప్పటివరకు ఇజ్రాయెల్పై 2 వేలకు పైగా రాకెట్లను పేల్చాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. శరణార్థి శిబిరంపై జరిపిన దాడిలో 10 మంది మరణించారు.
కాగా, పాలస్తీనా దాడిలో ఇజ్రాయెల్లో ఎనిమిది మంది మరణించారు. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ గాజాలోని ముఖ్య ప్రాంతాలపై బాంబు దాడులు చేసింది. అనేక బహుళ అంతస్తుల భవనాలను లక్ష్యంగా పెట్టుకుని బాంబులు వేస్తున్నారు. గాజా ప్రాంతంలో అతిపెద్ద దవాఖాన అయిన షిఫా దవాఖానకు వెళ్లే రహదారి తుడిచిపెట్టుకుపోయింది. దాంతో దవాఖానకు వెళ్లడం పాలస్తీనియన్లకు చాలా ఇబ్బందికరంగా తయారైంది.
టీకా ఉత్పత్తులు వేగవంతం చేయండి: మోదీకి ఆజాద్ లేఖ
యుద్ధం వస్తే అమెరికాదే ఓటమి: గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
13 రోజులు ప్రధానిగా వాజ్పేయి.. చరిత్రలో ఈరోజు
పంచన్ లామా సమాచారం ఇవ్వండి.. చైనాను అడిగిన అమెరికా
స్పైస్జెట్ నిర్వాకం.. రోజంతా పైలట్లకు జాగారం..
టీకాలు తీసుకున్నా.. మాస్క్లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
–తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..