ఛండీగఢ్ : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు రైతుల నిరసన సెగ తగిలింది. హిసార్లో ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో రైతులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రైతులను లాఠీఛార్జీ చేసి సీఎం కార్యక్రమం వేదిక నుంచి తరలించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడం వల్లనే లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చిందని పోలీసులంటున్నారు.
హిసార్లో నిర్మించిన దవాఖానను ప్రారంభించడానికి సీఎం ఖట్టర్ వచ్చారు. సీఎం పర్యటన గురించి తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రాలీల్లో అక్కడికి తరలివచ్చి ముఖ్యమంత్రిని ఘెరావ్ చేయడానికి ప్రయత్నించారు. రైతులు బారికేడ్లను పగులగొట్టి సభాస్థలి వైపు వస్తుండటంతో వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇంతలో ఒక్కసారిగా పోలీసులు తమ లాఠీలను పనిచెప్పడంతో రైతులు తలోదిక్కు పారిపోయారు. పోలీసులపై రైతులు రాళ్లు రువ్వడం వల్లనే పరిస్థితి అదుపుతప్పిందని, అందుకే లాఠీఛార్జీ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చుకుంటున్నారు.
పరిస్థితులు సాధారణమైన తర్వాత రైతులు ఆందోళనకు దిగవచ్చని, కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిరసన తెలుపుతున్న రైతులు తమతమ ఇండ్లకు తిరిగి వెళ్లిపోవాలని సీఎం ఖట్టర్ సూచించారు. ఇలాఉండగా, హర్యానాలో లాక్డౌన్ను ఈ నెల 24 వరకు పొడగించినట్లు హోంమంత్రి అనిల్ విజ్ ప్రకటించారు.
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్రనేత ఇల్లు ధ్వంసం
టీకా ఉత్పత్తులు వేగవంతం చేయండి: మోదీకి ఆజాద్ లేఖ
యుద్ధం వస్తే అమెరికాదే ఓటమి: గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
13 రోజులు ప్రధానిగా వాజ్పేయి.. చరిత్రలో ఈరోజు
పంచన్ లామా సమాచారం ఇవ్వండి.. చైనాను అడిగిన అమెరికా
–తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..