న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఒకవేళ ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే, అప్పుడు ఆ నియోజకవర్గ ఎన్నికను రద్దు చేయాలని, అక్కడ మళ్లీ ఎన్నిక నిర్వహించాలని దాఖలైన పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు ఇచ్చింది. నోటాకు ఓట్లు ఎక్కువ పోలైతే ఆ పరిస్థితుల్లో ఎలాంటి రూల్స్ అమలులో ఉండాలన్న అంశంపై ఆ పిటీషన్లో కోరారు. నోటా కన్నా స్వల్ప స్థాయిలో ఎక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులను అయిదేళ్ల పాటు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే రీతిలో రూల్స్ను రూపొందించాలని ఆ పిటిషన్లో సుప్రీంను కోరారు.
సామాజిక కార్యకర్త శివ ఖేరా వేసిన పిటీషన్పై సీజే డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పిటీషనర్ తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్, న్యాయవాది శ్వేతా మజుందార్ వాదించారు.