న్యూఢిల్లీ : యాంటీ-కొవిడ్ డ్రగ్ 2-డీజీ ఫస్ట్ బ్యాచ్ రేపు విడుదల కానున్నది. కరోనాపై పోరులో కీలకాస్త్రం కానున్న ఈ ఔషధాన్ని హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. కొవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ఈ ఔషధం మొదటి బ్యాచ్ రేపు అందుబాటులోకి రానున్నది. ఫస్ట్ బ్యాచ్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విడుదల చేయనున్నారు. దేశ రాజధానిలోని వివిధ దవాఖానల్లో 10,000 సాచెట్లను పంపిణీ చేయనున్నారు.
డీఆర్డీవో తయారు చేసిన 2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గత వారం అనుమతి ఇచ్చింది. ఈ ఔషధం కొద్దిగా నుంచి ఓ మోస్తరు కరోనా వైరస్తో బాధపడుతున్న పేషెంట్లపై బాగా పని చేసింది. ఒకవైపు చికిత్స అందిస్తూనే అదనంగా ఈ ఔషధాన్ని ఇవ్వడం వల్ల కరోనా రోగులు వేగంగా కోలుకునే అవకాశాలున్నాయని డీఆర్డీఓ వెల్లడించింది. అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాలినిచ్చిందని, ఆక్సిజన్పై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందని డీఆర్డీఓ తెలిపింది. ఈ డ్రగ్ పొడి రూపంలో సాచెట్లలో లభిస్తుంది. ఈ పొడిని నీళ్లలో కలుపుకొని తాగడం వలన వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీవో తెలిపింది.
ఈ ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి డీఆర్డీఓ 2020 ఏప్రిల్లో సన్నాహాలు మొదలుపెట్టింది. ఫస్ట్ వేవ్ సమయంలో డీఆర్డీఓ శాస్త్రవేత్తలు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయంతో ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఈ అణువు సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో కలిసి డీఆర్డీఓ ల్యాబ్ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది.
అమెరికా ఉద్యోగం కన్నా పాడిలో నాలుగింతలు ఎక్కువ సంపాదన : కిషోర్ మంత్రం
గంగా నది ఇసుకలో సమాధులు.. వెలికితీసిన వరుణుడు
సీఎం ఖట్టర్కు రైతుల నిరసన.. హిసార్లో పరిస్థితి ఉద్రిక్తం
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్రనేత ఇల్లు ధ్వంసం
టీకా ఉత్పత్తులు వేగవంతం చేయండి: మోదీకి ఆజాద్ లేఖ
యుద్ధం వస్తే అమెరికాదే ఓటమి: గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
13 రోజులు ప్రధానిగా వాజ్పేయి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..