న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశారు. ఇటీవల కేజ్రీవాల్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్సుల్లో ఆయన కూర్చున్న కుర్చీ వెనుకలా పెట్టిన జాతీయ హోంమత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా లేదని.. జెండాల్లో ఆకుపచ్చ రంగును పెద్దదిగా చేసి.. వక్రీకరించారని, మధ్యలో ఉండే తెలుపుదనాన్ని తగ్గించారని ఆరోపించారు. దేశ జాతీయ జెండా నియమావళికి ఇది విరుద్ధమన్నారు.
పొరపాటును వెంటనే సరిదిద్దాలని సూచించారు. అరవింద్ కేజ్రీవాల్ టెలివిజన్ బ్రీఫింగ్లో ప్రసంగించినప్పుడల్లా తన దృష్టి ఆయన కుర్చీ వెనుకలా ఉన్న జాతీయ జెండానే ఆకర్షిస్తుందన్నారు. కుర్చీ వెనుక పెట్టిన జాతీయ జెండాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నట్లు తెలిపారు. అలంకారం కోసం జాతీయ జెండాలను ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలోని తెలుపుదనం ఆకుపచ్చని రంగుతో తగ్గిపోయిందన్నారు. ఈ విషయాన్ని తెలిసో, తెలియకో పట్టించుకోని సీఎం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని పేర్కొన్నారు.