లక్నో : కల్తీ మద్యానికి ఏడుగురు వ్యక్తులు బలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటు చేసుకుంది. లోధా పోలీస్స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మరో నలుగురు స్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరణించిన వ్యక్తులు స్థానికంగా మద్యం కొనుగోలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో గౌతం బుద్ధనగర్, మధురకు చెందిన ఇద్దరు హెచ్పీ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ డ్రైవర్లు కాగా.. మిగతా వారంతా స్థానికులు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.