అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఓ బైకు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను దేవరశెట్టి నాగరాజు, పత్తిపాటి గోపిగా గుర్తించారు. ఇద్దరు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువుకు చెందినవారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.