న్యూఢిల్లీ : దేశంలో ఓ వైపు కరోనా విజృభణ కొనసాగుతోంది. మరో వైపు మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు టీకా పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 13 కోట్లకుపైగా డోసులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకే రోజు 29 లక్షల టీకాలు వేసినట్లు చెప్పింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు అందిన తాతాల్కి సమాచారం మేరకు ఇప్పటి వరకు మొత్తం 13,00,27,370 డోసుల టీకా వేసినట్లు తెలిపింది. టీకా డ్రైవ్ 95వ రోజున 28,98,257 వ్యాక్సిన్లు వేయగా.. ఇందులో 19,18,155 మంది లబ్ధిదారులకు మొదటి డోస్, 9,80,102 మందికి రెండో డోస్ వేసినట్లు వివరించింది.