ఎల్బీనగర్, జూలై 24: తెలంగాణ బంద్తో పాటు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్శాఖలో పోస్టులు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్తో నిరుద్యోగులు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు.
కాగా, నిరుద్యోగులంతా గాంధీభవన్ ముట్టడిస్తారనే సమాచారంతో విద్యార్థి జేఏసీ నాయకులను హాస్టళ్లు, రూమ్ల వద్ద సరూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. సాయంత్రం వరకు అదుపులో ఉంచుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మాత్రమే తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని అరెస్టయిన నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రప్రసాద్నాయక్, ఆకాశ్గౌడ్, నవీన్ పట్నాయక్ తెలిపారు.