ఖాట్మండు : కరోనా వైరస్ నేపాల్లో కేపీ ఒలి పాలిట శతృవుగా తయారైంది. రేపు ఉదయం విశ్వాసపరీక్ష నిర్వహించనుండగా.. ఒక్క రోజు ముందు నలుగురు మంత్రులతోపాటు 26 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. దాంతో విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న కేపీ ఒలికి సమస్యలు పెరిగాయి. రేపటి బలపరీక్ష జరుగుతుందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉన్నది. ఒకవేళ బలపరీక్ష వాయిదా పడితే ఒలి ప్రభుత్వం గట్టెక్కుతుంది. లేదంటే వెంటనే రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. కేపీ శర్మ ఒలి ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) ప్రచండ వర్గం మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస పరీక్ష తప్పనిసరైంది.
మైనారిటీలో నడుస్తున్న నేపాల్ కేపీ ఒలి ప్రభుత్వ విశ్వసనీయ ఓటును పొందడానికి కరోనా అడ్డంకిగా మారింది. ప్రత్యేక సమావేశానికి ముందు నలుగురు మంత్రులతోపాటు 26 మంది ఎంపీలు వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. విశ్వాస ఓటు పొందడానికి మే 10 గా ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయించారు. ప్రత్యేక సమావేశానికి ముందు ఎంపీలందరికీ పీసీఆర్ పరీక్ష నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు కరోనా వైరస్కు గురవడం వల్ల ఆందోళన పెరిగింది. వ్యాధి సోకిన నలుగురు మంత్రుల్లో ఇద్దరు ఇంకా ఎంపీలు కాలేదు.
ప్రస్తుతం 271 మంది సభ్యులు నేపాల్ దిగువ సభలో జరిగే ట్రస్ట్ ఓటులో పాల్గొననున్నారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రధాని ఒలికి 136 ఓట్లు అవసరం.
వచ్చే నెల 1 నుంచి నిలిచిపోనున్న గూగుల్ ఉచిత సేవలు
అమెరికా ఆకాశంలో గుర్తుతెలియని వస్తువులు.. నిజానికి అవేంటంటే..!
రెమ్డెసివిర్ అమ్ముతూ రెడ్హ్యాండెడ్గా దొరికిన వైద్యుడు.. వీడియో వైరల్
బిహార్లో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ ఆందోళన
బడాయూ ఎంపీ సంఘమిత్ర మౌర్య ఫేస్బుక్ ఐడీ హ్యాక్
దీదీ కోసం నా సీటును వదులుకుంటా : ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ
యూపీలో కరోనా కర్ఫ్యూ మే 17 వరకు పొడగింపు
క్రికెట్ ఆడే ఏనుగును ఎక్కడైనా చూశారా..? .. వీడియో వైరల్
మొట్టమొదటి బర్త్ కంట్రోల్ పిల్కు ఆమోదం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..