లక్నో : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అవసరం ఉంటేనే ఈ ఇంజెక్షన్ తీసుకోవాలని సీనియర్ వైద్యులు ఎంతగా సూచిస్తున్నా ప్రజల తీరు మాత్రం మారడంలేదు. దీంతో ప్రజల అవసరాలను ఆసరగా చేసుకుని కొందరు ఈ ఇంజెక్షన్ బ్లాక్ దందా కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో అమేథిలోని ఓ దవాఖాన వైద్యుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దాంతో ఆయనను ఇంఛార్జీ సూపరింటెండెంట్ పదవి నుంచి అధికారులు తొలగించారు.
అమెథీ కేంద్రంలోని కొవిడ్ దవాఖాన ఎల్- 2 సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే అజీజీకి కరోనా పాజిటివ్గా తేలడంతో ఆయన హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. ఇంఛార్జీ సూపరింటెండెంట్గా మరో వైద్యుడు డాక్టర్ ఆర్పీ గిరికి బాధ్యతలు అప్పగించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఇంఛార్జీ సూపరింటెండెంట్ గిరి.. సందట్లో సడేమియా అన్న చందంగా తన చేతిలో ఉన్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను అమ్మకానికి పెట్టాడు. ఓ పేషెంట్ అటెండెంట్ ఈ విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దాంతో బ్లాకులో మందులు అమ్ముకుంటున్న ఇంఛార్జీ సూపరింటెండెంట్ పదవి నుంచి డాక్టర్ గిరిని తప్పించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మందులే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లను కూడా పెద్ద మొత్తంలో అంబులెన్స్ డ్రైవర్లకు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా ఈయనపై ఉన్నాయి. ఈ విషయాలన్నింటిపై విచారణ జరుపుతున్నట్లు సీఎంఓ డాక్టర్ అశుతోష్ కుమార్ దూబే తెలిపారు.
బిహార్లో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ ఆందోళన
బడాయూ ఎంపీ సంఘమిత్ర మౌర్య ఫేస్బుక్ ఐడీ హ్యాక్
దీదీ కోసం నా సీటును వదులుకుంటా : ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ
యూపీలో కరోనా కర్ఫ్యూ మే 17 వరకు పొడగింపు
క్రికెట్ ఆడే ఏనుగును ఎక్కడైనా చూశారా..? .. వీడియో వైరల్
మొట్టమొదటి బర్త్ కంట్రోల్ పిల్కు ఆమోదం.. చరిత్రలో ఈరోజు
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..