రాయ్పూర్ : బీజాపూర్ ఎన్కౌంటర్ సందర్భంగా మావోయిస్టులు తమ బందీగా చేసుకున్న జవాన్ రాకేశ్వర్ మన్హాస్ విడుదల కోసం చర్చలు మొదలయ్యాయి. జైలు బందీ విడుదల కమిటీ చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. కమిటీలోని ఐదుగురు సభ్యులు గ్రౌండ్ జీరోకు బయలుదేరారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోని సోరి కూడా ఈ బృందంలో ఉన్నారు. వీరు నక్సలైట్లతో సమావేశమై చర్చలు జరుపుతారు. అలాగే వారి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తారు.
రెండు రోజుల క్రితం ఎన్కౌంటర్ సందర్భంగా తమతో తీసుకెళ్లిన సైనికుడు రాకేశ్వర్ మన్హాస్ చిత్రాన్ని నక్సలైట్లు విడుదల చేశారు. అతను పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. నక్సలైట్లతో మాట్లాడేందుకు ఏర్పాటైన కమిటీ బీజాపూర్ బయల్దేరి వెళ్లింది. ఈ బృందంతో పాటు సామాజిక కార్యకర్త సోని సోరి కూడా బయలుదేరారు. ఆయనతో పాటు కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రభుత్వంతో చర్చలు జరుగాలంటూ మావోయిస్టులు మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. బీజాపూర్ దాడిలో 24 మంది భద్రతా సిబ్బంది చనిపోగా.. మరో 31 మంది గాయపడ్డారు. కాగా నలుగురు నక్సలైట్లు కూడా మరణించినట్లు పేర్కొన్నారు. నక్సలైట్ల అదుపులో ఒక జవాన్ ఉన్నారని ఆ ప్రకటనలో మావోయిస్టులు తెలిపారు.
పోలీసులు, జవాన్లు తమ శత్రువులు కాదని, తమపై దాడి చేయడానికి వచ్చిన జవాన్లకు తగిన సమాధానం ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వంతో మాట్లాడతామని, ఇందు కోసం త్వరలో మధ్యవర్తులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
బెంగాల్ ఎన్నికల్లో ‘కూపన్ల పంపిణీ’ వివాదం
పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్.. పండిత్ రవిశంకర్.. చరిత్రలో ఈరోజు
హజ్ యాత్రికులకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి : సౌదీ ప్రభుత్వం
ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్కు 72 లక్షల జరిమానా
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..