లక్నో : అయోధ్య రామ మందిరం భూమి కుంభకోణం జరిగిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు, యూపీ ఇంఛార్జీ సంజయ్ సింగ్ ఆరోపణలపై అదే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతల నుంచే ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన రత్నేష్ మిశ్రా.. సంజయ్సింగ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. మా ఎంపీ చెప్పేవన్నీ అబద్దాలే అని కొట్టిపారేస్టున్నారు. అంతేకాకుండా ఆయన రామ్ ద్రోహి అని, పార్టీ నిధులను తారుమారు చేస్తున్నట్లు సంజయ్ సింగ్పై ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి రామ్ దేశద్రోహులకు పార్టీ నుంచి పంపించివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి కొనుగోలులో ఎలాంటి కుంభకోణం జరుగలేదని రత్నేష్ మిశ్రా అన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేస్తున్న ఆరోపణలు ముమ్మాటికీ అబద్దాలే అని అన్నారు. పార్టీకి వచ్చే నిధులను సంజయ్ సింగ్ తన సైకోఫాంట్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. పార్టీ నిధుల్లో కుంభకోణం జరిపారని చెప్పారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కలిసి విన్నవించేందుకు పార్టీ కార్యకర్తలను సంజయ్ సింగ్ అడ్డుకుంటున్నారని, సంజయ్సింగ్ కుంభకోణం గురించి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తెలియదని ఆప్ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు. సంజయ్సింగ్ తప్పుడు పనులను బయటపెట్టడానికి ఇవాళ నేను ధైర్యంగా ముందుకు వచ్చానని, సమయం వచ్చినప్పుడు చాలా మంది నాతో నిలబడతారన్నారు. నవాబ్గంజ్ నివాసి అయిన రత్నేష్ మిశ్రాను ఆప్ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపీ సంజయ్ సింగ్ సిఫారసుతో పార్టీ అధిష్ఠానం నియమించింది.
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్లో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్కు 134 ఏండ్లు
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!
చరిత్రలో ఈరోజు : హిందుత్వానికి ప్రతీకగా శివసేన ఆవిర్భావం
కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..