తల్లి ప్రేమకు వెలకట్టలేం. తల్లి ప్రేమను అందుకోవడం దేవుడిచ్చిన వరం. తన ముద్దుల కుమారుడు చనిపోవడంతో ఆ తల్లి ఏకధాటిగా ఏడుస్తూ ఉన్నది. ఆ తల్లి గోడును ఏ దేవుడు విన్నాడో ఏమో..! లే.. కన్నా లే..! అని పిలువగానే.. తల్లి మాట విని మరికాసేపట్లో మట్టిలో కలిసిపోయేందుకు సిద్ధమైన ఆ చిన్నారి లేచి కూర్చున్నాడు. ఈ షాకింగ్ వార్త హర్యానాలో చోటుచేసుకున్నది. ఒక్క పిలుపుతో ఆ ఆరేండ్ల పిల్లాడు లేచి కూర్చోవడంతో ఆ ఊరి వారంతా ఆ తల్లి ప్రేమను కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
హర్యానాలోని బహదూర్గఢ్ ప్రాంతానికి చెందిన హితేష్, ఝాన్వి దంపతులకు ఆరేండ్ల కుమారుడు ఉన్నాడు. టైఫాయిడ జ్వరం ఎంతకూ తక్కువ కాకపోవడంతో చికిత్స ఇప్పించేందుకు ఆ పిల్లాడ్ని ఢిల్లీలోని ఓ దవాఖానకు తరలించారు. అయితే, మే 26 న వైద్యులు చనిపోయినట్లు ప్రకటించడంతో చిన్నారి మృతదేహంతో సొంతూరుకు తిరిగొచ్చారు. అంత్యక్రియలు చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాత్రంతా శవం వద్ద జాగారణ చేస్తూ తల్లిదండ్రులు గడిపారు. ఏడుస్తూ.. లేచి కూర్చో నాన్నా.. అంటూ తల్లి అమాయకంగా పిల్లాడ్ని మృతదేహాన్నిఅటూ ఇటూ కదిపింది. దాంతో పిల్లాడి శరీరంలో కదలిక కనిపించడంతో ఒక్కసారి ఆశ్చర్యపోయిన తండ్రి వెంటనే తేరుకుని పిల్లాడి శరీరాన్ని ప్యాకింగ్ నుంచి వేరు చేసి నోటి ద్వారా శ్వాస అందించాడు. సినిమాల్లో చూసిని సీన్ గుర్తుకొచ్చి పొరుగింటి యువకుడు పిల్లాడి ఛాతీపై గట్టిగా ఒత్తడంతో ఒక్కసారి పిల్లాడి గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది. దాంతో చికిత్స నిమిత్తం పిల్లాడ్ని హుటాహుటిన రోహతక్ దవాఖానకు తరలించారు. పూర్తిగా కోలుకున్న బాలుడిని మంగళవారం ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయాడనుకున్న బాలుడు లేచి కూర్చోవడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అంతా అమ్మ ప్రేమ అంటూ మెచ్చుకున్నారు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
చరిత్రలో ఈరోజు.. ముంతాజ్ జ్ఞప్తిగా తాజ్మహల్ నిర్మాణం
కొత్తిమీర-పుదీనా పచ్చడితో 7 ఆరోగ్య ప్రయోజనాలు.. ఏవంటే..?
ఈ టెక్నాలజీతో ఎన్-95 మాస్క్లు, పీపీఈ కిట్ల రీయూజ్ సాధ్యం..!
డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒక్క మ్యాచ్తో విజేతను నిర్ణయించడం సరికాదు : సచిన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..