ఇంతకుముందు ప్రయాణం అంటే ఎకువ ప్రదేశాలు చూడటం, ఎకువ ఫొటోలు తీయడం, వెంటనే తదుపరి గమ్యానికి వెళ్లిపోవడం అనే భావన బలపడింది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘స్లో ట్రావెలింగ్’ అనే కొత్త ధోరణి వేగంగా ఆదరణ పొందుతున్నది. ఇందులో గమ్యస్థానాల సంఖ్య కాదు, అకడ గడిపిన అనుభవాలే అసలు సంపదగా భావిస్తారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు లేదా అంతకంటే ఎకువ రోజులు ఉండి అకడి ప్రకృతి, సంస్కృతి, ఆహారం, స్థానిక జీవన శైలిని ఆస్వాదించడం ఈ తరహా ప్రయాణాల ప్రత్యేకత. లేచి ఎక్కడికో పరుగు పెట్టాలన్నట్టు కాకుండా.. స్థానిక టీ దుకాణంలో చాయ్ తాగడం, చిన్న వీధుల్లో నడవడం, స్థానిక మారెట్లను సందర్శించడం, అకడి ప్రజలతో ముచ్చటించడం లాంటి చిన్న చిన్న అనుభవాలే వీటిని చిరస్మరణీయంగా మారుస్తాయి.
ఈ విధానం మనసుపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. నిరంతర ఉరుకులు పరుగుల జీవితానికి కొంత విరామం లభిస్తుంది. ఒత్తిడి తగ్గి, ప్రకృతితో మమేకమయ్యే అవకాశం పెరుగుతుంది. అదే సమయంలో స్థానిక వ్యాపారులకు ఆదాయం అందడం వల్ల పర్యాటకం మరింత స్థిరమైన దిశగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే, సోషల్ మీడియాలో చూపించడానికి కాకుండా, మనసులో నిలిచిపోయే జ్ఞాపకాలను సృష్టించుకోవాలనుకునే వారికి స్లో ట్రావెలింగ్ సరైన ఎంపిక.