న్యూఢిల్లీ : ప్రస్తుతం మాస్క్లు, పీపీఈ కిట్లకు డిమాండ్ చాలా ఉన్నది. అయితే, వీటి డిమాండ్కు తగినంత ఉత్పత్తి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు వీటిని రీయూజ్ చేసేందుకు వీలుగా ముంబైకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు దవాఖానల్లో ఉపయోగిస్తున్నారు. ఒక వైపు మాస్క్లు, పీపీఈ కిట్లను తిరిగి ఉపయోగించడం కొవిడ్-19 బయో-వేస్ట్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (ముంబై) లోని బయోసైన్సెస్ అండ్ బయో ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షించిన తర్వాత ఈ వ్యవస్థను ధ్రువీకరించారు. వైరస్లు, బ్యాక్టీరియాను క్రియారహితం చేయడంలో 99.999 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇది సీఎస్ఐఆర్-నీఈఈఆర్ఐ చేత ఆమోదించబడింది. అలాగే, ఐపీ55 ధ్రువీకరణ పొందింది. స్టార్ట్-అప్ ఇంద్ర వాటర్ ద్వారా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇందుకోసం స్టార్టప్కు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి ఎస్ఐఎన్ఈ బొంబాయి ద్వారా గ్రాంట్ లభించింది. ఎస్ఐఎన్ఈ-ఐఐటీ బొంబాయి సహాయంతో ఈ స్టార్టప్ ప్రతి నెలా 25 క్రిమిసంహారక వ్యవస్థలను తయారు చేసి సరఫరా చేయనున్నది.
వండర్ వుమెన్ : తలపై సామానుతో నీటిలో బైకుపై.. వీడియో వైరల్
సింహాలతో కొట్లాడి పిల్లను దక్కించుకున్న బర్రె.. వీడియో వైరల్
చంపత్రాయ్ను తొలగించాల్సిందే : స్వామి స్వరూపానంద సరస్వతి
బ్లాక్ గేమ్స్ రొచ్చు : హనీట్రాప్లో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు
ఫైనల్కు ముందు వివాదం : బయో బబుల్ను వీడిన కివీస్ ఆటగాళ్లు
గంగానదిలో పెట్టె.. పెట్టెలో దేవతల మధ్య చిన్నారి..
డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒక్క మ్యాచ్తో విజేతను నిర్ణయించడం సరికాదు : సచిన్
చరిత్రలో ఈరోజు : అంతరిక్షంలోకి వాలెంటినా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..