చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ( Lakshmi Narasimha Swamy) ఆలయం వద్ద పల్లకితో గిరి ప్రదక్షణ (Giripradakshina ) వైభవంగా జరిగింది. ఆలయ పూజారి పరాంశం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను సంప్రదాయ పద్ధతిలో గుట్ట చుట్టూ ఊరేగించారు. నరసింహ నామస్వరాలతో భక్తులు కీర్తనలు పాడారు. ప్రదక్షణలో స్వామివారి కీర్తనలు ఆలపిస్తూ ఆనందాలు పంచుకున్నారు.
ప్రతి నెల పౌర్ణమి రోజున నరసింహ స్వామి పల్లకి గిరిప్రదక్షిణ నిర్వహించడం జరుగు తుందని, ఆలయ పూజారి పరాంకుశం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పల్లకి సేవలో సర్పంచ్ అల్లేపు సంపత్, మాజీ సర్పంచ్ మామిడి అంజయ్య, ఆలయ చైర్మన్ కొలిపాక వేణు, సభ్యులు కాసం సతీష్, పాముల శ్రీకాంత్, బోయిని సంజీవ్, పీరల్ల తిరుపతి, లక్ష్మి, రేణుక, భక్తులు పాల్గొన్నారు .