చింద్వారా : అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చంపత్రాయ్ను తొలగించాలని శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఆయనను తొలగించడం ద్వారా ట్రస్ట్ను అవినీతిరహితంగా తయారుచేయవచ్చని సూచించారు. శ్రీ రామ జన్మభూమి మందిర్ నిర్మాణ్ ట్రస్ట్పై భూ కుంభకోణం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది. నర్సింగ్పూర్ జిల్లాలోని జ్యేతేశ్వర్ వద్ద పరమహంసి గంగా ఆశ్రమంలో ద్విపీఠాధీశ్వర్ జగత్గురు మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో ఆలయ నిర్మాణంలో నిమగ్నమైన ట్రస్ట్ పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు.
ప్రభుత్వం అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసిందని, అయితే ఇందులో అవినీతిపరులను చేర్చిందని శంకరాచార్య విమర్శించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంపత్ రాయ్ ఎవరు? ఇది వరకు ఎవరికీ తెలియదు, కాని అతడిని తీసుకొచ్చి రామ్ మందిర్ ట్రస్ట్లో చేర్చి ఆధిపత్యం చలాయించేలా చేశారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం అని నేరుగా చెప్పకుండా.. పార్లమెంటులో వారి సంఖ్య 2 ఉన్నప్పుడు ఆవు వధ నిషేధంపై సుదీర్ఘ పోరాటం జరిగిందని, పార్లమెంటులో వారి సంఖ్య 200 దాటినప్పుడు వారు ఆవు వధ అనే నినాదాన్ని మరచిపోయారని శంకరాచార్యులు ఆరోపించారు. ఆలయం పునాదిరాయి పూజ కార్యక్రమాలు చేపట్టే సమయంలో కూడా శుభ సమయాన్నివిస్మరించారని, చాలా దురదృష్టకరమని స్వరూపానంద సరస్వతి చెప్పారు. ఆనాడు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పూజాకార్యక్రమాల తేదీని మార్చలేదు.
బ్లాక్ గేమ్స్ రొచ్చు : హనీట్రాప్లో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు
ఫైనల్కు ముందు వివాదం : బయో బబుల్ను వీడిన కివీస్ ఆటగాళ్లు
గంగానదిలో పెట్టె.. పెట్టెలో దేవతల మధ్య చిన్నారి..
డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒక్క మ్యాచ్తో విజేతను నిర్ణయించడం సరికాదు : సచిన్
చరిత్రలో ఈరోజు : అంతరిక్షంలోకి వాలెంటినా
ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులువు
ఆన్-సైట్ : వ్యాక్సిన్ డోసుకు ప్రీ-రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..