న్యూఢిల్లీ: కొవిడ్-19 టీకాలను పొందటానికి ప్రీ-రిజిస్ట్రేషన్ లేదా అపాయింట్మెంట్ బుకింగ్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. టీకాలు తీసుకోవడంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదికలు అందిన తర్వాత ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది. 18 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా నేరుగా సమీప టీకాల కేంద్రానికి వెళ్లి అక్కడ టీకా ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ డోసు పొందవచ్చు.
కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కో-విన్లో రిజిస్ట్రేషన్ సులభతరం చేసే అనేక రీతుల్లో ఒకటి అని కేంద్రం వివరించింది. ఆరోగ్య కార్యకర్తలు లేదా ఆశా కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులను, పట్టణ మురికివాడల్లో నివసించేవారిని ఆన్-సైట్ రిజిస్ట్రేషన్, టీకాల కోసం నేరుగా సమీప టీకా కేంద్రాలలో సమీకరించనున్నారు. 1075 హెల్ప్ లైన్ ద్వారా అసిస్టెడ్ రిజిస్ట్రేషన్ల సౌకర్యం కూడా అమలు చేయనున్నారు. ఈ నెల13 వ తేదీ నాటికి కో-విన్లో నమోదైన 28.36 కోట్ల మంది లబ్ధిదారుల్లో 16.45 కోట్ల (58 శాతం) లబ్ధిదారులు ఆన్-సైట్ మోడ్లో నమోదు చేసుకున్నారు. అలాగే జూన్ 13 నాటికి కో-విన్లో నమోదైన మొత్తం 24.84 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల్లో 19.84 కోట్ల డోసులను (దాదాపు 80 శాతం) ఆన్సైట్ / వాక్-ఇన్ టీకా ద్వారా అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నది.
మా ఆయన చనిపోలేదంటున్న 38 మంది భార్యలు
చెస్ట్ ప్యాచ్ : దవాఖాన నుంచే కొవిడ్ రోగుల పర్యవేక్షణ
మార్చొద్దు : యెడ్డికి మద్దతుగా లింగాయత్ పీఠాధిపతులు
అమెజాన్ అండ : ఇంజినీరింగ్ విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్ స్కిల్స్
క్లాట్ 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన కన్సార్టియం
ఏనుగుల దాడి : జైలులో గ్రామస్థుల బస
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
గైర్హాజరు ఎందుకో : బెంగాల్ బీజేపీలో ముదురుతున్న సంక్షోభం
చరిత్రలో ఈరోజు : గల్వాన్ వీరులకు వందనం
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..