అగ్ర కథానాయకుడు వెంకటేశ్, కల్యాణ్రామ్లతో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ ప్రతిష్టాత్మ మల్టీస్టారర్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ దిగ్విజయంగా తొలి షెడ్యూల్ని పూర్తి చేసుకున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్లో ఈ షెడ్యూల్ జరిగిందని, వెంకటేశ్, కల్యాణ్రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టిలపై కీలకమైన టాకీపార్ట్తో పాటు, ఓ పాటను కూడా చిత్రీకరించామని, ఈ షెడ్యూల్లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాట సినిమాకే హైలైట్స్గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు.
అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. కెమెరా: సమీర్రెడ్డి, సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, సమర్పణ: సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన.