ముంబై : టెస్ట్ ఛాంపియన్ను ఒక్క మ్యాచ్ నిర్వహించడం ద్వారా నిర్ణయించడం సరికాదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విధానంతో టెండూల్కర్ విభేదించారు. పటిష్ఠ బ్యాటింగ్ లైనప్తో ఉన్న ఇండియానే డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలుస్తుందని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్లోని సౌతాంప్టన్లో న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చివరి మ్యాచ్ను టీమిండియా ఆడనున్నది. టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ 1, నంబర్ 2 ర్యాంకుల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్పై మొత్తం క్రికెట్ ప్రపంచం దృష్టి సారించింది. ఈ ఫైనల్ మ్యాచ్ గురించి ప్రపంచంలో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ హిందీ మీడియాతో ముచ్చటించారు. సచిన్ అభిప్రాయాలు ఆయన మాటల్లో..
“ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కింద పలు టెస్ట్ సిరీస్లు ఆడి భారత, న్యూజిలాండ్ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. ఫైనల్ను మ్యాచ్గా కాకుండా సిరీస్గా ఆడి ఉంటే బాగుంటుంది. ఒక్క మ్యాచ్తో విజేతను నిర్ణయించడం సరైంది కాదు. ఆకాశం మేఘావృతమై పిచ్ తడిగా ఉంటే జాగ్రత్తగా ఆడాలి. క్రీజ్ సెట్ అయిన తర్వాత బ్యాటింగ్ వేగంగా చేయవచ్చు. ఫైనల్లో కూడా వాతావారణం చాలా ముఖ్యమైనది. ఆటగాళ్ళు తమ ఆటను తదనుగుణంగా మార్చుకోవాలి. ఫైనల్లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ.. మొదట బ్యాటింగ్ చేయాలా లేక బౌలింగ్ చేయాలా? అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. పిచ్ తడిగా ఉండి లేదా ఆకాశం మేఘావృతమై ఉండి అలాంటి పరిస్థితులు ఎక్కువసేపు ఆశిస్తే.. తొలుత బౌలింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాతావరణం స్పష్టంగా ఉంటే, పిచ్లో తేమ తక్కువగా ఉంటే.. మొదట బ్యాటింగ్ చేయడం మంచిది.”
“న్యూజిలాండ్ జట్టు కూడా చాలా సమతుల్యతతో ఉన్నది. వారికి ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ వంటి స్ట్రైక్ బౌలర్లు ఉన్నారు. నీల్ వాగ్నెర్, కోలిన్ డీ గ్రాండ్ హోమ్ కూడా మద్దుతుగా ఉన్నారు. చివరి మ్యాచ్లో కివీస్ జట్టు బోల్ట్, సౌతీపై ఎక్కువ ఆధారపడతారని నా అభిప్రాయం. వీరు చాలా మంచి బౌలర్లు. భారత జట్టులో ఎంతో అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు. బ్రాట్స్మెన్ చక్కగా రాణిస్తున్నారు. బ్యాటింగ్లో ఇండియాదే పైచేయిగా ఉంటుంది. అన్ని వాతావరణాల్లో చక్కగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిచే అన్ని అవకాశాలు భారత్కే ఉన్నాయి..” అని సచిన్ వెల్లడించారు.
చరిత్రలో ఈరోజు : అంతరిక్షంలోకి వాలెంటినా
ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులువు
ఆన్-సైట్ : వ్యాక్సిన్ డోసుకు ప్రీ-రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
క్లాట్ 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన కన్సార్టియం
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..