న్యూయార్క్ : కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందున్న అమెరికా.. ఇప్పుడు దాని నివారణలో మరో అడుగు వేసింది. ఇప్పటివరకు టీకా పరిశోధనలపై దృష్టిపెట్టిన అమెరికా.. ఇప్పుడు కొవిడ్ ట్యాబ్లెట్లను తయారుచేయడంపై కన్నేసింది. ఈ ట్యాబ్లెట్ అభివృద్ధి, పరిశోధనల కోసం దాదాపు 3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొవిడ్ -19 వ్యాక్సిన్ తయారీకి అమెరికా ఔషధ తయారీ సంస్థలకు అమెరికా ప్రభుత్వం 18 బిలియన్ డాలర్లు ఇచ్చింది. ప్రభుత్వం ప్రోత్సాహంతో అమెరికా సంస్థలు 5 రకాల వ్యాక్సిన్లను సిద్ధం చేశాయి. అదే మార్గంలో కొనసాగుతూ అమెరికన్ పరిశోధకులు కొవిడ్ -19 మాత్రలు తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం బైడెన్ పరిపాలనా యంత్రాంగం 3 బిలియన్ డాలర్ల నిధులు కేటాయించింది.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఆరోగ్య, మానవ సేవా విభాగం (డీహెచ్హెచ్ఎస్) ఈ కొవిడ్ పిల్ కార్యక్రమాన్ని ప్రకటించింది. కొన్ని కంపెనీలు త్వరలో దీని ట్రయల్స్ చేసే పనులను చేపట్టనున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. ఈ ఏడాది చివరికల్లా మాత్రలు మార్కెట్లో ఉంటాయని చెప్తున్నారు అమెరికా అధికారులు. ఈ పరిశోధన కార్యక్రమం కరోనాపై మాత్రమే కాకుండా పాజిబిల్ డిసీజెస్ మందులపైనా కూడా జరుగుతుండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఇన్ఫ్లూయెంజా, హెచ్ఐబీ, హెపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కూడా తయారుచేయనున్నారు. వీటిపై పరిశోధన ఏడాదిపాటు కొనాసాగనున్నది. అయితే, కరోనా ట్యాబ్లెట్ తయారీకే ఎక్కువ సమయం కేటాయించి వీలైనంత త్వరగా పిల్స్ అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. కొవిడ్ -19 రోగులకు యాంటీవైరల్ మాత్రల ద్వారా చికిత్స చేయగలిగే సమయం త్వరలో వస్తుందని భావిస్తున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా గెలుపుపై గంగూలీ.. ఏం చెప్పాడంటే..?
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్లీ గురూ..!
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..