ముంబై : మరికొన్ని గంటల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగడానికి ముందు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొన్ని సూచనలు చేశారు. తన సూచనలను పాటిస్తే టీమిండియా గెలుపు సాధ్యమని నొక్కిచెప్పారు. టాస్ గెలియిన తర్వాత టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకోవాలని, గిల్, రోహిత్ జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడం ద్వారా భారత్కు విజయం సాధ్యమని చెప్పారు. అలాగే, అశ్విన్ కొత్త రికార్డు నెలకొల్పడం కూడా సాధ్యమేనన్నారు.
టాస్ గెలిచిన తర్వాత టీమిండియా మొదట బ్యాటింగ్ చేయడం చాలా మంచిదని, ఎందుకంటే చాలా రోజుల తర్వాత విదేశీ పర్యటనల్లో పాల్గొనడం వల్ల జట్టు ఆటపై మరింత ఆసక్తిని కలిగి ఉంటుందని అన్నారు. గత రికార్డులను పరిశీలిస్తే, విదేశాల్లో మొదట బ్యాటింగ్ చేయడం ద్వారా మనం చాలా మ్యాచ్లను గెలిచామని తెలుస్తుందని గంగూలీ చెప్పారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనే కాకుండా ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్లో కూడా రోహిత్, గిల్ జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషభ్పంత్ ఇబ్బంది పడకుండా ఉండటానికి వీరిద్దరూ కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొత్త రికార్డుకు చేరువలో ఉన్న అశ్విన్ ఈ మ్యాచ్లో ఆ రికార్డును తన పేరిట రాసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్లీ గురూ..!
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..