టోక్యో : టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి జపాన్ చక్రవర్తి నరుహిటో హాజరు కానున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులెవరూ లేకుండా జరుగుతున్న ఈ ఒలింపిక్స్లో ముందుగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెయ్యి మంది వీఐపీల సమక్షంలోనే శుక్రవారం ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు నరుహిటో హాజరవుతుండగా.. ఆయన భార్య మహారాణి మసకొ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉండనున్నారు. నరుహిటో తండ్రి చక్రవర్తి అఖిహిటో1998 నగనో వింటర్ గేమ్స్ను ప్రారంభించగా.. ఆయన తాత హిరోహిటో 1964 టోక్యో సమ్మర్ గేమ్స్, 1972 సప్పొరో వింటర్ గేమ్స్ను ప్రారంభించారు.