హైదరాబాద్ : అద్భుత ప్రతిభ ఉన్న యువ క్రీడాకారులను వెలికి తీసుకువచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న హాకీ లీగ్ త్వరలో అభిమానులను అలరించనున్నది. హైదరాబాద్ హాకీ ఆధ్వర్యంలో ‘హాకీ లెజెండ్స్ ప్రీమియర్ లీగ్’ (హెచ్ఎల్పీఎల్) ఈ నెల చివరి వారంలో ప్రారంభంకానున్నది. హెచ్ఎల్పీఎల్ తొలి సీజన్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీపడుతాయని హైదరాబాద్ హాకీ కార్యదర్శి కామిని విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత హాకీకి విశేష సేవలందించిన దిగ్గజ ఆటగాళ్లు ముకేశ్ కుమార్, దిలీప్ టిర్కీ, సోమయ్య, మహమ్మద్ షాహిద్, పర్గత్సింగ్, జాఫర్ ఇక్బాల్, ధన్రాజ్ పిౖళ్లె , భాస్కరన్ పేర్ల మీద లీగ్లో జట్లు పోటీపడుతాయని పేర్కొన్నారు. దాదాపు 200 మంది ప్లేయర్లు బరిలోకి దిగనున్న ఈ టోర్నీలో 28 లీగ్ మ్యాచ్లు, ఆరు సూపర్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు.