అమరావతి : గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,527 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా మహమ్మారి బారి నుంచి మరో 2,412 మంది బాధితులు కోలుకోగా.. వైరస్తో ప్రభావంతో కొత్తగా 19 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,749కు పెరిగింది. ఇందులో 19,09,613 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 13,197కు చేరింది.
ప్రస్తుతం ఏపీలో 23,939 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 515, చిత్తూరులో 318, ప్రకాశంలో 303, పశ్చిమ గోదావరిలో 288, కృష్ణాలో 249, నెల్లూరులో 206, గుంటూరులో 182, విశాఖపట్నంలో 133, కడప జిల్లాలో 111 అత్యధికంగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వివరించింది. 24 గంటల్లో 86,280 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.