హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా 565 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. 24 గంటల్లో 1,14,260 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,908 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,38,721కు పెరిగాయి.. ఇందులో ఇప్పటి వరకు 6,25,042 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మొత్తం 3,771 మంది ప్రాణాలు కోల్పోయారు.