హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 74వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సోమవారం ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరిగే ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు. ‘సర్’ ప్రక్రియ, పార్టీ వ్యవహారాలతో పాటు ఇటీవల ఢిల్లీ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే కార్యాచరణపై చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం.