న్యూఢిల్లీ : ఆత్మనిర్భర భారత్లో దేశీయ రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) ముందడు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (ఎంపీఏటీజీఎం)ను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ బరువుతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెట్ మిసైల్(ఎంపీఏటీజీఎం)ను విజయవంతంగా పరీక్షించింది. థర్మల్ సైట్తో అనుసంధానమైన పోర్టబుల్ లాంచర్ నుంచి ఈ క్షిపణిని డీఆర్డీఓ ప్రయోగించింది. డైరెక్ట్ అటాక్ మోడ్లో లక్ష్యాన్ని ఛేదించినట్లు పేర్కొంది.
మిస్సైల్ ఖచ్చితత్వంతో టార్గెట్ను ఛేదించిందని తెలిపింది. మిషన్ అన్ని లక్ష్యాలు నెరవేరాయని చెప్పింది. ఈ ప్రయోగం ద్వారా దేశీయ క్షిపణి సైనిక శక్తి మరింత పటిష్టమవుతుందని తెలిపింది. ఈ క్షిపణి గరిష్ఠ పరిధిలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించగా.. కనిష్ఠ పరిధిలో చేపట్టిన ప్రస్తుత పరీక్ష కూడా విజయవంతమైంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ గరిష్ఠ పరిధి 2.5 కిలోమీటర్లు. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా మోసుకెళ్లేలా డీఆర్డీఓ రూపొందించింది.