న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి. మరో వైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ఇందులో 3,03,53,710 మంది డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి ప్రభావంతో మొత్తం 4,14,482 మంది బాధితులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో వైపు టీకా డ్రైవ్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 41,18,46,401 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.