చండీగఢ్ : కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు వీలుగా మరింత వైద్య సేవలు అందించేందుకు హర్యానాలోని ప్రైవేటు దవాఖానలు ఇకపై ప్రభుత్వ ఆజమాయిషీలో పనిచేయనున్నాయి. ప్రైవేటు దవాఖానల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ కొన్ని రోజులుగా వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్, హర్యానా హోం, ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ బుధవారం సుదీర్ఘంగా చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొవిడ్ను సమర్ధంగా కట్టడి చేసేందుకు ప్రతి జిల్లాకు నియమితులైన నోడల్ అధికారులు ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అన్ని రకాల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని సూచనలు ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువగా చికిత్స పొందుతున్న రోగుల నుంచి ప్రైవేటు దవాఖానలు వసూలు చేయడాన్ని నిరోధించేందుకే ఇలా ప్రైవేట్ హాస్పిటళ్లపై ఆజమాయిషీ పెట్టి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించారని తెలుస్తున్నది.
అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ కోటాను పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. ఇకపై జిల్లాలకు సూచించిన ఆక్సిజన్ మొతం కంటే 30 శాతం పెంచాలని ఆదేశించారు. అలాగే, అంబాలా, కర్నాల్, నల్హార్, కురుక్షేత్ర, రేవారితో పాటు వివిధ ఆసుపత్రుల్లో కొవిడ్ పడకల ప్రభుత్వ కోటాను పెంచారు. భవిష్యత్లో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఓటమితో మమతకు సీఎంగా నైతిక హక్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్
యాహూతో గూగుల్ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
ఫుట్పాత్పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
‘రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు’: నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై ఈసీ
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..