వాషింగ్టన్ : ప్రపంచంలోనే ఒకప్పుడు టాప్ సెర్చ్ ఇంజిన్గా నిలిచిన యాహూను కొనుగోలు చేసి గూగుల్ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తున్నది. యాహూను కొనుగోలు చేయడానికి 44.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు) ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను తమ బోర్డు పరిశీలిస్తున్నట్లు యాహూ తెలిపింది. 700 మిలియన్ల యూజర్ బేస్ ఉన్న యాహూ షేర్ ధర ప్రస్తుతం దాదాపు 48 శాతం పెరిగి 28.33 డాలర్లకు (దాదాపు రూ.2,090) చేరింది.
యాహూను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ 2008 నుంచి ప్రయత్నిస్తున్నది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగితే వినియోగదారులు చాలా ప్రయోజనాలను పొందే వీలుంటుందని నిపుణులు చెప్తున్నారు. వార్తలు, ఆర్థికం, క్రీడలకు సంబంధించిన వార్తల కోసం ప్రతి నెలా 50 కోట్ల మంది వినియోగదారులు యాహూను సందర్శిస్తున్నారంటే దాని క్రేజీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చునంటున్నారు నిపుణులు.
ఈమెయిల్ సేవలో కూడా ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్నది. సెర్చ్ ఇంజిన్, మెయిల్తోపాటు ఎంటర్టైన్మెంట్, ఫైనాన్స్, లైఫ్స్టైల్, న్యూస్, రీసెర్చ్, షాపింగ్, స్మాల్ బిజినెస్, స్పోర్ట్స్, ట్రావెల్ వంటి రంగాల్లో కూడా యాహూ విశేష సేవలందిస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నది. అయితే, గూగుల్ కూడా పలు రంగాల్లో సేవలందించడంతో పోటీ పెరిగింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ యాహూ సంస్థను తీసుకొని అభివృద్ధి పరిస్తే గూగుల్ సంస్థకు పోటీగా నిలుస్తుంది. దీని వల్ల వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ వింగ్ సెర్చ్ ఇంజిన్కు 2019 లో ఒక్క అమెరికాలోనే 126 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గూగుల్ సెర్చ్ ఇంజన్ కంటే ఎక్కువ మంది ఇక్కడ వింగ్ సెర్చ్ ఇంజిన్ను ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో 2016 లో ప్రతి నెల 700 మిలియన్ల వినియోగదారులు యాహూ సెర్చ్ ఇంజిన్ను సందర్శించేవారు. ఇప్పటికీ యాహూ క్రియాశీల వినియోగదారుల సంఖ్య 225 మిలియన్లుగా ఉండటం విశేషం.
ఫుట్పాత్పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
‘రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు’: నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై ఈసీ
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..