అగర్తలా : నందిగ్రాంలో ఓటమిపాలైన మమతా బెనర్జీకి సీఎం పదవిలోకి వచ్చే నైతిక హక్కు లేదని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే చాలా మంది ముఖ్యమంత్రి అయ్యారని, అయితే మమతా బెనర్జీ నందిగ్రామ్లో ఓడిపోయి సీఎం పదవి తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రజలు ఎన్నుకోనందున ఆమె నైతికంగా ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. తనపై కుట్ర జరిగిందని చెప్తున్న మమతా బెనర్జీ .. ఆమె ఓటమి ఒక కుట్ర అయితే, వారి పార్టీ విజయం వెనుక కూడా కుట్ర దాగి ఉన్నదని ఆయన ఆరోపించారు. బుధవారం నాడు ఆయన అగర్తలాలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింస చెలరేగడంపై బిప్లబ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన వారిపై దాడులకు తెగబడిన టీఎంసీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎంసీ నేతల దాడులతో బీజేపీ కార్యకర్తలు పొరుగున ఉన్న త్రిపుర, అసోం రాష్ట్రాలకు పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఇకనైనా హింస జరుగకుండా చూడాలని ఆయన మమతకు విజ్ఞప్తి చేశారు. టీఎంసీ దారుణాలను నిరసిస్తూ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు త్రిపుర అంతటా బీజేపీ కార్యకర్తలు క్యాండిల్స్ వెలిగించాలని ఆయన కోరారు.
యాహూతో గూగుల్ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
ఫుట్పాత్పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
‘రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు’: నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై ఈసీ
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..