టోక్యో : తనకు బాగా అచ్చొచ్చిన ‘సెగ్న్యూర్ మెడికాట్’ (గుర్రం పేరు) తోనే టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగాలని భారత జాకీ ఫవాద్ మీర్జా నిర్ణయించుకున్నాడు. అంతకుముందు ‘దజర 4’తో పోటీలోకి దిగాలని భావించిన ఫవాద్.. ఆ గుర్రం తీవ్ర ఒత్తిడిలో ఉందని అతడు భావిస్తున్నాడు. ఒలింపిక్స్ మరో రెండురోజుల్లో మొదలవబోతుందనగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఫవాద్ ఇష్టంగా ‘మిక్కీ’ అని పిలుచుకునే సెగ్న్యూర్తో అతడు 2018లో జరిగిన ఆసియా గేమ్స్లో రెండు రజత పతకాలు గెలిచాడు. జర్మనీలో క్వారంటైన్ పూర్తి చేసుకున్న మిక్కీ సోమవారం రాత్రే టోక్యోకు చేరింది.