కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ జరపనుంది. నందిగ్రామ్లో ఆమె చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. రెండో విడత పోలింగ్లో భాగంగా నందిగ్రామ్లోని ఓ పోలింగ్ బూత్కు వెళ్లిన మమత.. అక్కడ పోలింగ్ సజావుగా సాగడం లేదని ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఆమె ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. శాంతిభద్రతల విషయంలో ఏదో జరిగిపోతోందని ఊహించుకొని ఆమె ఈ ఫిర్యాదు చేసినట్లుగా ఉన్నదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఆమె లేఖ వాస్తవానికి దూరంగా ఉన్నదని స్పష్టం చేసింది.
ఇవికూడా చదవండి..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా