లండన్ : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బ్రిటన్ను భయపెడుతున్నది. డెల్టా వేరియంట్ల పెరుగుతున్న కేసుల దృష్ట్యా జూన్ 21 తో ముగిసే లాక్డౌన్ ఆంక్షలను 4 వారాల పాటు పొడిగించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. తాజా గణాంకాలను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాబోయే వారాల్లో ఈ వేరియంట్ కేసులు పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు భయపడుతున్నారు.
ఆదివారం బ్రిటన్లో 7,490 కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడు రోజుల క్రితంతో పోలిస్తే దేశంలో 49 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొదట గుర్తించిన డెల్టా రూపం (బీ 1.617.2) కేసులు వారంలో 30 వేల నుంచి 42,323 కు పెరిగాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) తెలిపింది. డెల్టా వేరియంట్ల భయంతో టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే కార్యక్రమాన్ని కూడా యూకే ప్రధాని ప్రకటించవచ్చు. సామాజిక భౌతిక దూరం పాటించడం అనే నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రజలకు శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు విజ్ఞప్తి చేశారు. టీకాలు వేగవంతం చేయడానికి లాక్డౌన్ వ్యవధిని పొడిగించాలని వీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
గెలుపు కోసం : యూపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ..?
ఏడాది ఆలస్యం : అక్టోబర్ 1 నుంచి దుబాయ్ ఎక్స్పో 2020
చరిత్రలో ఈరోజు : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
అంతరిక్షం నుంచి వచ్చిన స్పెర్మ్తో 168 ఎలుకలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..