లక్నో : ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటనలో ఆద్యంతం ఇవే విషయాలను చర్చించినట్లుగా తెలుస్తున్నది. ఢిల్లీ నుంచి లక్నో రాగానే వెళ్లి గవర్నర్ ఆనందిబెన్ పటేల్తో సమావేశమయ్యారు. దీంతో త్వరలో ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరుగనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. 17 రోజుల వ్యవధిలో గవర్నర్తో రెండు సార్లు ముఖ్యమంత్రి సమావేశం కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నది.
క్యాబినెట్ మంత్రులు చేతన్ చౌహాన్, కమలా రాణి వరుణ్, విజయ్ కశ్యప్ చనిపోయిన అనంతరం క్యాబినెట్లో ఖాళీలు ఏర్పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున.. రాజకీయ సమీకరణాలను సమతుల్యం చేయడానికి క్యాబినెట్ను త్వరలో విస్తరించవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటన ఒకే అవగానే గవర్నర్ ఆనందీబెన్ పటేల్తో సీఓం యోగి ఆదిత్యనాథ్ మే 27 న సమావేశమయ్యారు. అప్పుడు ఇద్దరి మధ్య 50 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ఢిల్లీలో ప్రధాని మోదీ, అమిత్షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తీవ్రంగా చర్చించి తిరిగి శుక్రవారం సాయంత్రం లక్నోకు తిరిగొచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన మరుసటి రోజే గవర్నర్తో భేటీ అవడంతో మంత్రివర్గ విస్తరణ జరుగొచ్చని పలువురు నేతలు అనుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్లో 2017 మార్చి 19 న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి 2019 ఆగస్టు 22 న మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆ సమయంలో మంత్రివర్గంలో 56 మంది సభ్యులు ఉన్నారు. కరోనా కారణంగా ముగ్గురు మంత్రులు మరణించారు. ఇటీవల, విజయ్ కుమార్ కశ్యప్ మరణించగా, ఫస్ట్వేవ్లో చేతన్ చౌహాన్, కమల్ రాణి వరుణ్ మరణించారు. యూపీలో గరిష్టంగా క్యాబినెట్ మంత్రుల సంఖ్య 60 వరకు ఉంటుంది. మొదటి క్యాబినెట్ విస్తరణలో ఆరుగురు మంత్రులకు స్వతంత్ర ఛార్జీతో క్యాబినెట్ ప్రమాణం చేయించారు. ప్రస్తుతం మరో ఏడుగురికి మంత్రి పదవులు కట్టబెట్టే యోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. అప్నాదళ్ నేతలకు ఈసారి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు చెప్తున్నారు.
ఏడాది ఆలస్యం : అక్టోబర్ 1 నుంచి దుబాయ్ ఎక్స్పో 2020
చరిత్రలో ఈరోజు : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
అంతరిక్షం నుంచి వచ్చిన స్పెర్మ్తో 168 ఎలుకలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..