TMC rebell MPs : బెంగాల్ (Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీని వీడిన 20 మంది ఎంపీలు.. త్రిపుర (Tripura) కు చెందిన గుర్తింపులేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP) లో చేరారు. త్రిపురతోపాటు అస్సాం, మేఘాలయ, బెంగాల్ రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలకు మద్దతుగా ఈ పార్టీని గతంలో రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ ఆ పార్టీకి గుర్తింపు లేదు. ఇప్పుడు తృణమూల్ రెబెల్ ఎంపీలు (Rebel MPs) టీఎంసీని రెండుగా చీల్చకుండా ఆ పార్టీలో చేరడం ద్వారా తమది విభజన కాదు, విలీనం అని చెప్పకనే చెప్పారు.
అదేవిధంగా ఒకేసారి 20 మంది ఎంపీలు పార్టీని వీడి తమపై అనర్హత వేటుపడకుండా రాజ్యాంగబద్ధమైన వ్యూహాన్ని అనుసరించారు. ఇక టీఎంసీ రెబెల్ ఎంపీలు చేరిన ఎన్సీపీ 2023లో ఒక్కసారి మంత్రి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. ఆ ఎన్నికల్లో ముగ్గురిని తన అభ్యర్థులుగా నిలబెట్టి కేవలం 1198 ఓట్లు మాత్రమే సాధించింది. ఇప్పుడు రెబెల్ ఎంపీలు చేరడంతో ఆ పార్టీ ఏకంగా లోక్సభలో 20 మంది ఎంపీలు ఉన్న పార్టీగా మారిపోయింది.
భారత రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీలో మూడింట రెండొంతుల మంది ప్రజాప్రతినిధులు పార్టీని వీడితే వారిపై అనర్హత వేటు పడదు. అందుకే లోక్సభలో టీఎంసీకి 28 మంది సభ్యుల బలం ఉండగా.. అందులో 20 మంది తిరుగుబాటు చేశారు. కానీ వారు టీఎంసీని రెండు ముక్కలు చేయకుండా.. గుర్తింపులేని ఎన్సీపీలో చేరారు.