ముంబై : దుబాయ్ ఎక్స్పో 2020 ఈ ఏడాది అక్టోబర్ 1 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. కరోనా కారణంగా ఏడాది ఆలస్యంగా ఈ మెగా ఈవెంట్ జరుగనున్నది. ఆరు నెలలపాటు కొనసాగే ఈ ఎక్స్పోలో 190 కి పైగా దేశాలు పాల్గొననున్నాయి. రూ.500 కోట్లతో తయారుచేసిన భారతదేశం పెవిలియన్ పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నది.
ది గ్రేట్ వరల్డ్ ఎక్స్పోకు 170 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నది. మొదటిసారి ఈ ఎక్స్పో లండన్లోని ఐకానిక్ క్రిస్టల్ ప్యాలెస్లో జరిగింది. దుబాయ్లో ప్రస్తుతం 438 హెక్టార్ల స్థలంలో ఏర్పాటుచేశారు. కనెక్టింగ్ మైండ్-క్రియేటింగ్ ఫ్యూచర్ అనే ప్రధాన థీమ్తో ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ను వీక్షించేందుకు ప్రపంచ దేశాల నుంచి దాదాపు 2.5 కోట్ల మంది రావచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ఎక్స్పోలో పాల్గొంటున్న ప్రతి దేశం ఈ కార్యక్రమాన్ని వీక్షించేవారికి తమ వాణిజ్యం, సంస్కృతి, చరిత్ర, పర్యాటక రంగం, ఇతర విశేషణాలను పరిచయం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న దాదాపు అన్ని దేశాలు తమ సొంత పెవిలియన్లను కలిగి ఉంటాయి. తమతమ దేశాల్లో వాణిజ్య సామర్థ్యాన్ని సందర్శకులకు తెలియజేస్తాయి. ఎక్స్పోలో ఇండియా తమ పెవిలియన్లో మినీ ఇండియాను చూపించేందుకు సిద్ధమైంది. సంగ్రహావలోకనం కనిపిస్తుంది. ఇందులో స్పేస్, యోగా, న్యూ / మోడరన్ ఇండియా సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.
భారతదేశం పెవిలియన్ తయారీకి దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు దుబాయ్లోని చీఫ్ కాన్సులేట్ సిద్ధార్థ్ కుమార్ బరేలీ తెలిపారు. ఫ్లోర్, లుక్, పెయింటింగ్, ఫ్రంట్ ఫేస్, స్ట్రక్చర్ మొదలైనవి దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. పెవిలియన్లో పార్ట్-ఏ, పార్ట్-బీ అనే రెండు భాగాలను వచ్చే నెలకల్లా అప్పగించనున్నారని వెల్లడించారు.
చరిత్రలో ఈరోజు : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
అంతరిక్షం నుంచి వచ్చిన స్పెర్మ్తో 168 ఎలుకలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..