Unemployees | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దిల్ సుఖ్ నగర్లో రోడ్డెక్కి ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని తెలిసిందే.
తాజాగా దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగులు పోరు బాట పట్టారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ డప్పు చప్పుళ్లతో నిరుద్యోగులు నిరసన తెలిపారు. పోలీసులు నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
5 వేల పోస్టులు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో దిల్ సుఖ్ నగర్ పరిసరాలు మార్మోగిపోయాయి. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే ఓయూలో కూడా విద్యార్థులు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారని తెలిసిందే.
దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత
మరోసారి రోడ్డు పైకి వచ్చిన నిరుద్యోగులు
నిరుద్యోగుల పై పోలీసుల దాడి
డప్పు చప్పుళ్ళతో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు
పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
5 వేల పోస్టులు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని… https://t.co/UBOJQ9DAZh pic.twitter.com/7Sy3eCVUnP
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026
దిల్సుఖ్నగర్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
రోడ్డు పైకి వచ్చి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అక్రమ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
5 వేల పోస్టులు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్
అక్రమంగా అరెస్ట్… https://t.co/vj0gglmKp1 pic.twitter.com/r87hkUSbId
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026