ఇండోర్ : భారతదేశ తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాతగా పరిగణించబడుతున్న చంద్ర నాయుడు ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న చంద్ర నాయుడు ఇండోర్లో తన నివాసంలో మరణించారు. ఆమె వయసు 88 ఏండ్లు. మాజీ క్రికెటర్ సీకే నాయుడు కుమార్తె.
గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉండి చికిత్స తీసుకుంటున్న చంద్ర నాయుడు ఇవాళ మధ్యాహ్నం కన్నుమూసినట్లు ఆమె సోదరి కుమారుడు విజయ్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
వయసు సంబంధ అరోగ్య సమస్యలతో చంద్ర నాయుడు బాధపడుతున్నారు. ఆమె ఇండోర్లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా పనిచేశారు. అలాగే హోల్కర్ కాలేజీలో చదువుతున్నప్పుడు 50 వ దశకంలో క్రికెట్ ఆడారు. ఆమె ఆటపై చురుకైన ఆసక్తిని కనబర్చారు. అంతర్జాతీయ మ్యాచ్కు వ్యాఖ్యాతగా పనిచేసి భారతదేశ తొలి మహిళ వ్యాఖ్యాతగా రికార్డులకెక్కారు.
80 వ దశకంలో తన తల్లి జ్ఞాపకార్థం ట్రోఫీని విరాళంగా ఇవ్వడం ద్వారా మహిళల ఇంటర్-యూనివర్శిటీ క్రికెట్ టోర్నమెంట్ను ప్రవేశపెట్టారు. ఆమె ఎంపీసీఏలో చురుకైన సభ్యురాలుగా ఉండి అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఇండోర్, జెయింట్స్ ఇంటర్నేషనల్ క్రియాశీల సభ్యురాలుగా అనేక సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
లార్డ్స్ మ్యూజియానికి తన తండ్రి సీకే నాయుడు వినియోగించిన క్రికెట్ బ్యాట్ అందజేత సమయంలో లార్డ్స్ కామన్ రూమ్లోకి ప్రవేశించేందుకు అనుమతి పొందిన ఏకైక మహిళగా చంద్ర నాయుడు నిలిచారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు చంద్ర నాయుడు చురుకుగా ఉండి.. బీసీసీఐ, సీసీఐ, ఎంపీసీఏ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు.
చంద్ర నాయుడు మృతిపట్ల మాజీ క్రికెటర్, ఎంపీసీఏ అధ్యక్షుడు సంజయ్ జగ్దలే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహిళా క్రికెటర్లను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన కొనియాడారు.
నిత్యం 10 నిమిషాల వీడియో గేమింగ్.. క్రీడా నైపుణ్యాలను పెంచుతుంది..
వ్యాక్సిన్ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్ శరణార్థులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా చింతన్ వైష్ణవ్
బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు న్యాయమూర్తులను నియమించిన సుప్రీంకోర్టు
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళను అమ్మేసిన దుర్మార్గుడు
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం
అణగారిన వర్గాల గొంతుక బాబుజీ.. చరిత్రలో ఈరోజు
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..