Priyanka Gandhi : యాంటీ-పేపర్ లీక్ బిల్లు (Anti-paper leak bill) పై లోక్సభ (Lok Sabha) లో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ (Pellet Guns) వినియోగించడాన్ని, లాఠీఛార్జి చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆయుధాలు ప్రయోగించడానికి వారేమైనా ఉగ్రవాదులా..? అని ప్రశ్నించారు.
విద్యార్థుల మీద పోలీసుల దౌర్జన్యంపై ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ యువత తమ ప్రజాస్వామ్య హక్కులను శాంతియుతంగా వినియోగించుకుంటుండగా.. వారిపై దాడి చేయడం సరైన చర్య కాదన్నారు. విద్యార్థుల నిరసనను ఆయుధాలతో అణచివేయాలని పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. పేపర్ లీక్ల కారణంగా బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు.