కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు లేకపోవడంతో పిల్లలు ఇంటిపట్టునే ఉంటూ వీడియోగేమ్స్ తెగ ఆడేస్తున్నారు. ఏ పని చెప్పినా చేయకుండా వీడియో గేమ్స్ ఆడటంలో నిమగ్నమై పోవడంతో.. చాలా మంది తల్లిదండ్రులు చిరాకు పడుతున్నారు.
అయితే, నిత్యం వీడియో గేమ్స్ ఆడటం కూడా మంచిదేనంటున్నారు పరిశోధకులు. ఇటీవల వచ్చిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం వీడియో గేమ్స్ నిత్యం కేవలం 10 నిమిషాలు ఆడటం ద్వారా వారిలో క్రీడా నైపుణ్యాలను గణనీయంగా మెరుగుపరుచవచ్చు. ‘కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్’ పత్రికలో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురించారు.
లెరో, సైన్స్ ఫౌండేషన్ ఐర్లాండ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సాఫ్ట్వేర్, యూనివర్శిటీ ఆఫ్ లిమెరిక్ (యూఎల్) పరిశోధకులు ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. క్రీడా శిక్షణకు ముందు 20 నిమిషాల పాటు ట్రాన్స్క్రానియల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్ (టీడీసీఎస్) ను పంపిణీ చేసే కస్టం హెడ్సెట్ ధరించినప్పుడు అనుభవం లేని గేమర్స్ చాలా ప్రయోజనం పొందారని అధ్యయనం కనుగొన్నది.
న్యూరో స్టిమ్యులేషన్ ముఖ్యంగా అనుభవం లేని ఎస్పోర్ట్స్ లో పాల్గొనేవారిలో మోటారు పనితీరు మెరుగుదలను వేగవంతం చేస్తుందని, ఈ ప్రభావం మరింత సంక్లిష్టమైన ఇంద్రియాలకు పరిమితం చేయబడిందని లెరో ఎస్పోర్ట్స్ సైన్స్ రీసెర్చ్ ల్యాబ్ (ఈఎస్ఆర్ఎల్) డైరెక్టర్, యూఎల్ స్పోర్ట్స్ సైకాలజీలో సీనియర్ లెక్చరర్ డాక్టర్ మార్క్ కాంప్బెల్ చెప్పారు.
‘గత 20 ఏండ్లలో ప్రముఖమైన గేమ్లలో ఒకటి ఫస్ట్-పర్సన్ షూటర్ (ఎఫ్పీఎస్) గేమ్, కౌంటర్-స్ట్రైక్: గ్లోబల్ అఫెన్సివ్ (సీఎస్: జీఓ). శతృ లక్ష్యాలను త్వరగా తొలగించాలని పాల్గొన్నవారిని కోరాం. అధ్యయనంలో వారి శిక్షణా సెషన్లలో సాధ్యమైనంత ఖచ్చితంగా చేయగలిగారు. నిత్యం విద్యార్థులు గేమింగ్పై కొద్ది సమయం దృష్టిపెట్టడం వల్ల వారి మెదడు చురుకుగా పనిచేస్తుందని తమ పరిశోధనలో తేలింది’ అని డాక్టర్ ఆడమ్ టోత్ తెలిపారు.
వ్యాక్సిన్ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్ శరణార్థులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్గా చింతన్ వైష్ణవ్
బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు న్యాయమూర్తులను నియమించిన సుప్రీంకోర్టు
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళను అమ్మేసిన దుర్మార్గుడు
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం
అణగారిన వర్గాల గొంతుక బాబుజీ.. చరిత్రలో ఈరోజు
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..