గువహతి : అసోం కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన హిమంత బిస్వా శర్మ పేదరికాన్ని తగ్గించడానికి జనాభా నియంత్రణ పాటించాలని అక్కడి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. అసోంలోని ముస్లింలంతా “నాగరిక కుటుంబ నియంత్రణ విధానం” అవలంబించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసి 30 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో పేదరికం తగ్గడానికి తమ వంతుగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, జనాభాను నియంత్రించడంలో సమాజంలోని వాటాదారులంతా పాటుపడాలని కోరారు.
పేద ప్రజలందరికీ ప్రభుత్వం రక్షకుడని, అయితే పేదరికం, నిరక్షరాస్యత, సరైన కుటుంబ నియంత్రణ లేకపోవటానికి మూలకారణమైన జనాభా పెరుగుదల సమస్యను పరిష్కరించడానికి మైనారిటీ వర్గాల మద్దతు అవసరమని ముఖ్యమంత్రి హిమంత అన్నారు. పేదరికం సమస్యను సమర్థంగా పరిష్కరించడానికి వీలుగా సమాజంలోని మహిళలకు అవగాహన కల్పించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని శర్మ చెప్పారు. ఆలయం, సత్రా, అటవీ భూములను ఆక్రమణకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని తెలిపారు.
హిమంత బిస్వా శర్మ ఇటీవల అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికన్నా ముందు ఆయన శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో విద్య, ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. విద్యా మంత్రిగా హిమంత శర్మ ఉన్న సమయంలో అసోంలోని మదర్సాలను మూసివేసే పెద్ద నిర్ణయం తీసుకున్నారు. హిందువులు నివసించే ప్రదేశాల్లో గొడ్డు మాంసం తినకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
జేఎన్యూలో అల్లరి : లైబ్రరీ ధ్వంసం చేసి సిబ్బందిని కొట్టిన విద్యార్థులు
డిబేట్ ఇలాగేనా : టీవీ చర్చలో ఎంపీని కొట్టిన ఇమ్రాన్ మాజీ సలహాదారు
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
ఇక నిశ్చింత : కరోనా రోగుల సేవలో గ్రేస్ రోబోట్
ఆర్థిక సాయం : తాలిబాన్ కోసం పాకిస్తాన్ మసీదుల్లో విరాళాల సేకరణ
ఫొటోలో నిజాలు : కిమ్ ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు..!
నియామకం : యూఎన్ ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా నాగరాజ్ నాయుడు
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
డిజిటల్ పేమెంట్స్ : నాలుగేండ్లలో 1200 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీలు
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
35 ఏండ్ల క్రితం : లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..