న్యూఢిల్లీ : కరోనా రోగులను జాగ్రత్తగా చూసుకోవటానికి రోబోట్ నర్స్ సిద్ధంగా ఉన్నది. రోగి శరీర ఉష్ణోగ్రతలను తెలుకోవడం, వారికి ఔషధాలు ఇవ్వడం, రకరకాల హావభావాలను పలికిస్తూ రోగులతో మాట్లాడటం ఈ రోబోట్ ప్రత్యేకత. గ్రేస్ అని పిలుచుకునే ఈ రోబోట్ను హాంకాంగ్కు చెందిన హాన్సన్ కంపెనీ తయారు చేసింది. కరోనా వైరస్కు గురైన వారి సంరక్షణలో నిమగ్నమవడమే ప్రధాన లక్ష్యంగా ఈ రోబోట్ను తయారుచేసినట్లు సంస్థ పేర్కొంటున్నది. వాస్తవానికి ఈ రోబోట్ ఐసోలేషన్లో ఉండే కరోనా రోగులను అచ్చం నర్సులాగే చూసుకుంటుందని సంస్థ వెల్లడించింది.
నీలిరంగు యూనిఫాంలో నిలబడి ఉన్న గ్రేస్ రోబోట్ ఛాతీ భాగంలో థర్మల్ కెమెరా అమర్చబడి ఉంటుంది. ఈ కెమెరా రోగి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కనుగొంటుంది. ఇది కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా రోగి సమస్యను అర్థం చేసుకుంటుంది. ఇంగ్లిష్, మాండరిన్, కాటోనీస్ భాషలలో స్పందిస్తుంది. దీనిని కార్టూన్ సీరియల్లోని పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ రోబోట్ 48 కన్నా ఎక్కువ హావభావాలను ప్రదర్శిస్తుంది. అచ్చం మనుషుల్లాగే మాట్లాడి రోగుల సమస్యలు తెలుసుకుంటుంది.
ఈ రోబోట్ తయారీ కన్నా ముందుగా 2017 హ్యూమనాయిడ్ రోబోట్ సోఫియాను ఈ కంపెనీ తయారుచేసింది. దీనికి సాధారణ ప్రజల మాదిరిగా పౌరసత్వం లభించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో ఇది మొదటి ఆవిష్కరణ ఛాంపియన్గా నిలిచింది. కరోనా రోగుల చూసుకోవడానికి సోఫియా సేవలను కూడా వినియోగించుకున్నారు. సోఫియా 50 కంటే ఎక్కువ ముఖ కవళికలను అర్థం చేసుకుంటుంది.
ఆర్థిక సాయం : తాలిబాన్ కోసం పాకిస్తాన్ మసీదుల్లో విరాళాల సేకరణ
ఫొటోలో నిజాలు : కిమ్ ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు..!
నియామకం : యూఎన్ ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా నాగరాజ్ నాయుడు
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
డిజిటల్ పేమెంట్స్ : నాలుగేండ్లలో 1200 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీలు
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
35 ఏండ్ల క్రితం : లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..