న్యూఢిల్లీ : లక్షద్వీప్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన ప్రఫుల్ పటేల్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడాన్ని అక్కడి ఎంపీ మహ్మద్ ఫైజల్ తీవ్రంగా నిరసించారు. గొడ్డు మాంసం తినకూడదని ప్రఫుల్ పటేల్ విధించిన నిబంధనపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఎంపీ మహ్మద్ ఫైజల్ చెప్పారు. లక్షద్వీప్ నిర్వాహకుడు ప్రఫుల్ పటేల్ను తక్షణమే విధుల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఒక జాతీయ హిందీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.
“నేను అక్కడ ఎంపీని, ఈ నిబంధనల గురించి నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దాని ముసాయిదా ప్రచురించబడినప్పుడు నాకు తెలిసింది. అక్కడి సామాన్య ప్రజలు ఈ విషయం తెలుసుకున్నట్లే, నేను కూడా తెలుసుకున్నాను. పంచాయతీ ప్రతినిధులకు దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వారితో ఎటువంటి చర్చ జరగలేదు. ఇవి ఏకపక్ష చట్టాలు” అని మహ్మద్ ఫైజల్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో మాపై నిబంధనలను రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మా జీవన విధానంపై ఆజమాయిషీ చలాయించాలని చూస్తున్న నిర్వహకుడు ప్రఫుల్ పటేల్ను వెంటనే తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
డామన్-డయు, దాద్రా-నగర్ హవేలీ నిర్వాహకుడైన ప్రఫుల్ పటేల్కు 2020 డిసెంబర్లో లక్షద్వీప్ అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. అప్పటినుంచి ఇక్కడి వారు గొడ్డు మాంసం తినకుండా నిషేధం విధించారు, మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తీసుకొచ్చారు. గూండా యాక్ట్ను అమలు చేస్తున్నారు. ఇక్కడి 96 శాతం జనాభా ముస్లింలు కావడంతో వారికి వ్యతిరేకంగానే ప్రఫుల్ పటేల్ చేత కేంద్రం ఈ నిబంధనలు అమలు చేయిస్తున్నదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
మంచి డిక్రీ : వ్యాక్సిన్ వేసుకోని వారికి గ్రామ బహిష్కరణ
సమష్ఠి విజయం : తొలి మాస్క్ రహిత దేశంగా ఇజ్రాయెల్
చరిత్రలో ఈరోజు.. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సా ముండా
తప్పుడు అఫిడవిట్లు : జైలుశిక్ష పెంచాలని సీఈసీ లేఖ
మళ్లీ ఉద్రిక్తత : తూర్పు లడఖ్లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..