న్యూఢిల్లీ : ఎన్నికల సంస్కరణలు పెండింగ్లో ఉన్నాయని, ఈ ప్రతిపాదనలను వేగవంతం చేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు లేఖ రాశారు. ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చే వారికి జైలుశిక్షను ప్రస్తుత ఆరు నెలల నుంచి రెండేండ్లకు పెంచాలని ప్రతిపాదనను లేఖలో సూచించారు. అలాగే రెండేండ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేండ్ల పాటు నిషేధించేలా చట్టంలో మార్పులు చేయాలని సీఈసీ విజ్ఞప్తి చేశారు.
ఓటర్లు ప్రభావితం కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రచారానికి చివరి రోజు, పోలింగ్ రోజున వార్తాపత్రికల్లో రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించాలని న్యాయ మంత్రికి రాసిన లేఖలో సుశీల్ చంద్ర ప్రతిపాదించారు. ప్రస్తుతానికి పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ఎన్నికల ప్రచార సామగ్రిని చూపకుండా నిరోధిస్తున్నారు. కానీ ప్రింట్ మీడియాను ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 126 పరిధిలోకి తీసుకురావాలని కమిటీ ఇప్పుడు సిఫారసు చేసింది.
ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానించడం వల్ల దొంగ ఓట్లను నిరోధించవచ్చునని ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తన లేఖలో సూచించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల లోక్సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా.. ఎన్నికల కమిషన్ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉన్నదని, దీనికి ఎన్నికల చట్టాల్లో సవరణ అవసరమని తెలిపారని సీఈసీ పేర్కొన్నారు.
మళ్లీ ఉద్రిక్తత : తూర్పు లడఖ్లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
బాబోయ్ ఎండలు : దుబాయ్లో మండుతున్న సూరీడు
మరింత శక్తి : వచ్చే నెలలో భారత్కు అమెరికా సీహాక్ హెలీకాప్టర్స్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
రిత్రలో ఈరోజు.. ఆలిండియా రేడియోగా నామకరణం
కొత్త సేవలు : స్పీడ్ పోస్ట్లో అస్తికల నిమజ్జనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..