కొరకరానికి కొయ్యలా మారిన గిరిజనుల ఆరాధ్యదైవం అయిన బిర్సా ముండాను బ్రిటిష్ సైన్యం విషమివ్వడంతో 1900 లో సరిగ్గా ఇదేరోజున చనిపోయారు. అప్పటికి ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు. నీరు, అటవీ, భూమి కోసం గిరిజనుల పక్షాన నిలిచి పోరాటం చేసిన గొప్ప వ్యక్తిగా, బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు బిర్సా ముండా. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు అయిన బిర్సా ముండా గౌరవార్ధం ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాలులో నెలకొల్పారు.
ప్రస్తుత జార్ఖండ్లోని ఖుంతీ జిల్లా ఉలిహతు గ్రామంలో 1878 నవంబర్ 15 న బిర్సా ముండా జన్మించారు. 1895 లో బ్రిటిష్ వారు విధించిన జమీందారీ, ఆదాయ వ్యవస్థకు వ్యతిరేకంగా బిర్సా ముండా పోరాడారు. వడ్డీ మనీలెండర్లపై బిర్సా తిరుగుబాటు చేశారు. ఈ మనీలెండర్లు రుణాలకు బదులుగా గిరిజన భూములను స్వాధీనం చేసుకునేవారు. బిర్సా ముండా మరణం వరకు కొనసాగిన ఈ తిరుగుబాటును ‘ఉల్గులాన్’ అని పిలుస్తారు. బ్రిటిష్ వారు అడవులను లాక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు గిరిజనులలో అసంతృప్తి పెరగడం మొదలైంది. సాగు పద్ధతులపై బ్రిటిషర్లు ఎన్నో ఆంక్షలు విధించారు.
బిర్సా ముండా గిరిజనులను అణచివేత శక్తులకు వ్యతిరేకంగా కార్యోన్ముఖులుగా చేశారు. 1897 ఆగస్టు నెలలో బిర్సా మరో 400 మంది గిరిజనులతో కలిసి స్థానిక పోలీసు స్టేషన్పై దాడి చేశాడు. ముండా, బ్రిటిష్ వారి మధ్య చివరి యుద్ధం జనవరి 1900 లో జరిగింది. రాంచీ సమీపంలోని దుంబరి కొండపై జరిగిన ఈ యుద్ధంలో వేలాది మంది గిరిజనులు బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నారు, చాలా మందిని బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. చివరికి బిర్సాను చక్రధర్పూర్ నుంచి అరెస్టు చేసి రాంచీ జైలులో బంధించారు. ఇక్కడ అతనికి విషం ఇవ్వడంతో చనిపోయినట్లుగా చెప్తారు.
2011: ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ కన్నుమూత
2008: ‘చక్ దే ఇండియా’ చిత్రానికి 9 వ ఐఫా అవార్డులు, షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడి అవార్డు ప్రదానం
1995 : స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాత ఆచార్య ఎన్జీ రంగా కన్నుమూత
1983: బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన మార్గరెట్ థాచర్
1975: బ్రిటిష్ పార్లమెంట్ సభ కార్యకలాపాలు రేడియోలో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం
1960: చైనాలో మేరీ తుఫాను, 1600 మంది మరణం
1959: జార్జ్ వాషింగ్టన్ జలాంతర్గామిని ప్రారంభించిన అమెరికా
1934: మొదటిసారి తెరపై కనిపించిన ‘డోనాల్డ్ డక్’
తప్పుడు అఫిడవిట్లు : జైలుశిక్ష పెంచాలని సీఈసీ లేఖ
మళ్లీ ఉద్రిక్తత : తూర్పు లడఖ్లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..