భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలు పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మంచి డిక్రీని పాస్ చేశాయి. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారిని గ్రామ బహిష్కరణ చేస్తామని మధ్యప్రదేశ్లోని 4 పంచాయతీలలోని 13 గ్రామాలు నిర్ణయం తీసుకున్నాయి. గ్రామ బహిష్కరణకు గురైన వారిని ఏ కార్యక్రమాంలోనూ ఆహ్వానించకూడదని కూడా నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ను తీసుకునేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పలువురు సర్పంచ్లు అంటున్నారు.
భోపాల్కు చెందిన 4 పంచాయతీల పరిధిలోని 13 గ్రామాలు తమ గ్రామం నుంచి ఎవరైతే కరోనా వ్యాక్సిన్ తీసుకోరో.. వారికి గ్రామబహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించాయి. వారి ఇంటికి ఎవరూ వెళ్లకపోవడం, వారిని మరే ఇతరులు ఆహ్వానించకుండా ఉండటం ఈ బహిష్కరణలో ముఖ్య ఘట్టం. ఈ కఠిన డిక్రీని రతిబాద్, సర్వార్, సికింద్రాబాద్, ముండ్ల పంచాయతీల పరిధిలోని 13 గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామల మొత్తం జనాభా దాదాపు 15 వేలుగా ఉండగా.. వీరిలో ఇప్పటివరకు 5 వేల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగతా వారికి ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
వ్యాక్సిన్పై గ్రామీణుల్లో ఉన్న అపోహలును తొలగించేందుకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. టీకా కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు సామాజికంగా బహిష్కరణ ఆదేశాలను అమలులోకి తీసుకొచ్చారు. ఈ భయం కారణంగా ప్రజలు టీకాలు వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. టీకా బృందాన్ని చూడగానే ప్రజలు తలుపులు మూసుకునేవారని, అయితే ఈ కఠిన నిర్ణయంతో ప్రజలు టీకా బృందం కోసం ఎదురుచూస్తున్నారని సర్వార్ పంచాయతీ సర్పంచ్ లాల్ సింగ్ మీనా చెప్పారు. మా గ్రామంలో వ్యాక్సిన్ – సేవ్ లైవ్స్ ప్రచారాన్ని ప్రారంభించామని లాల్ సింగ్ మీనా తెలిపారు.
సమష్ఠి విజయం : తొలి మాస్క్ రహిత దేశంగా ఇజ్రాయెల్
చరిత్రలో ఈరోజు.. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సా ముండా
తప్పుడు అఫిడవిట్లు : జైలుశిక్ష పెంచాలని సీఈసీ లేఖ
మళ్లీ ఉద్రిక్తత : తూర్పు లడఖ్లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..